Powered By Blogger

Tuesday 30 September 2014

రుధిర సౌధం 255




వంటలు జరుగుతున్న స్థలం దగ్గరికి వెళ్లి అక్కడ పనుల్లో బిజీ గా ఉన్న బాలయ్య ని చూసి ... బాలయ్యా .. అంటూ

గట్టిగా పిలిచాడు యశ్వంత్ ..

ఆ .. అయ్యా .. అంటూ పరుగున వచ్చాడు బాలయ్య ..

వంటలు సిద్ధమవుతున్నాయా ? అని అడిగాడు యశ్వంత్ .

దాదాపు అయిపోయినట్టే నయ్యా ..  అన్నాడు  వినయం గా బాలయ్య .

సరే .. గేటు అవతల ఓ బిచ్చగత్తె అడుక్కుంటోంది .. భోజనాలు మొదలయ్యాక ఆమె నీ లోపలికి వచ్చి భోజనం

చెయ్ మను .. తనకేమన్న డబ్బు కావాలంటే కూడా నన్ను అడిగి ఇవ్వు తనకి .. అందరూ తృప్తి గా భోజనం

చేయాలి .. అర్థం అయిందా ? అన్నాడు యశ్వంత్ .

అలాగే నయ్యా .. తప్పకుండా ఆ బిచ్చమడుక్క్కునే దాన్ని పిలుత్తానయ్యా .. గొప్పమనసయ్యా మీది .. అన్నాడు

బాలయ్య .

నాది కాదు .. అమ్మాయి గారిది .. మర్చిపోకు సుమీ .. అన్నాడు యశ్వంత్ .

సరే నయ్యా .. అని తిరిగి పనిలో నిమగ్న మయ్యాడు బాలయ్య .

యశ్వంత్ .. నువ్విక్కడ ఉన్నావా ? అంటూ వచ్చాడు శివ .

ఏం ? నన్ను వెతుక్కుంటు న్నావ? ఇప్పటి వరకూ రచన నేను కనబడట్లేదని గోల పెట్టింది .. ఇప్పుడు నువ్వా ?

అన్నాడు యశ్వంత్ .

ఏంటీ ? రచన తో గొడవా ? తమాషాగా అన్నాడు శివ .

అదేo లేదు లే .. కూల్ అయిపొయింది గానీ .. విషయం చెప్పు ? అన్నాడు యశ్వంత్ .

అయ్యో .. అది మర్చిపోయాను చూడు .. నిన్ను స్వామీజీ రమ్మన్నారు యశ్వంత్ . కోట పై బురుజు మీద ఆకాశ

దీపం వెలగాల్సి ఉందట .. దానికోసం పిలిచారు .. నీతో మాట్లాడాలి అన్నారు .. అన్నాడు శివ .

ఓహ్ .. పద .. వెళదాం .. అని ముందుకి  నడిచాడు యశ్వంత్ ..

ఇద్దరూ కాసేపట్లో స్వామీజీ ముందు ఉన్నారు ..

చెప్పండి స్వామీజీ .. పిలిచారట .. అన్నాడు యశ్వంత్ వినయం గా ఆయన ముందు నిలబడి ..

అప్పటికే అక్కడ మురారి , విక్కీ కూర్చుని ఉన్నారు ..

అవును నాయనా .. ముందర కూర్చోండి మీ ఇరువురూ కూడా .. అన్నారు స్వామీజీ .

యశ్వంత్ , శివ కూడా ఆశీనులయ్యారు .

శ్రద్ధగా వినండి .. భోజన కార్యక్రమం అయ్యాక ఊరివాల్లన్దర్నీ ఎవరి ఇళ్ళకి వాళ్ళు  వెళ్లి వారి వారి ఇళ్ళల్లో

పూజాదికాలు నిర్వహించమని చెప్పండి .. సాయంత్రం అయ్యేవరకూ ఎవ్వరు ఇంటి గడప దాట రాదు .. ఆ

సమయంలోనే .. సాయంత్రం మీ నలుగురూ .. కోట బురుజు పైకి వెళ్లి ఆకాశ దీపం వెలిగించ వలసి ఉంటుంది ..

ఇది మహత్తర కార్యం .. మీరు సంసిద్ధులై ఉంటారని మిమ్మల్ని పిలిపించాను అన్నారు స్వామీజీ .

అలాగే స్వామీజీ .. అన్నారు అందరూ ..

ఇక మీ ముగ్గురూ వెళ్ళండి .. నేను యశ్వంత్ తో మాట్లాడాలి అన్నారు స్వామీజీ ..

శివ , విక్కీ , మురారి లేచి వెళ్ళిపోయారు ..

చెప్పండి స్వామీజీ ? విపత్తు ఎటువైపు నుండి రాబోతుంది ? అని అడిగాడు యశ్వంత్ సీరియస్ గా ..

అది చెప్పేందుకే నిన్ను పిలిపించింది నాయనా అన్నారు స్వామీజీ ..

ఇంకా ఉంది






మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

1 comment:

Unknown said...


I have been surfing online more than 3 hours today, yet I never found any interesting article like yours. It's pretty worth enough for me. Personally, if all website owners and bloggers made good content as you did, the internet will be a lot more useful than ever before. gmail.com login