మెల్లిగా సంజె చీకట్లు కమ్ము కుంటున్నాయి ..
మహల్ దగ్గర పని సజావుగా సాగుతుంది .. జనం లో ఉత్సాహం ఉరకలేస్తూ ఉంది .. మహల్ బాగు పడుతోంది
ఊరు బాగు పడుతుంది . తమకి మంచి రోజులు వచ్చాయన్న భావన అందర్లో కనబడుతోంది ..
మహల్ ఆవరణ లో కూర్చుని , మధ్యాహ్నం భోజనాలు ముగించి నప్పటి నుంచి గ్రంథం చదవడం మొదలు పెట్టిన
యశ్వంత్ సాలోచన గా గ్రంథం మూసి పక్కన పెట్టాడు .
గుడ్ ఈవెనింగ్ యశ్ .. గ్రంథం చదవడం పూర్తీ అయిందా ? అప్పుడే బయట నుండి వస్తున్న శివ యశ్వంత్ దగ్గర
కి వస్తూనే అడిగాడు .
హా అయింది శివ .. చాలా ఆసక్తిగా ఉంది .. నిజం చెప్పాలంటే బుర్రకి పదును పెట్టింది .. అన్నాడు యశ్వంత్ .
మన పూర్వీకులు అంత తెలివైన వారు మరి .. అన్నాడు శివ .
అది సరే .. నువ్వు సత్య , మురారి లను తీసుకోస్తానన్నావ .. మరి ఒక్కడివే వచ్చావెం ? అని అడిగాడు యశ్ .
ఓహ్ అదా .. సత్య కదలలేని స్థితి లోనే ఉందింకా .. మురారి ఈరోజు రాత్రి సత్యని సరస్వతి ఇంట్లోనే
ఉంచుదామన్నాడు ... నాకూ తన స్థితి చూసే సరికి అదే మంచిదనిపించింది . ఇక్కడ మనం అంతా బిజీ గా
ఉంటాం .. అక్కడ సత్య ని సరస్వతి కంటికి రెప్పలా చూసుకుంటుంది .. రాత్రికి మాత్రం మురారి ఇక్కడికే వస్తా
నన్నాడు .. సరస్వతి వాళ్ళింట్లో తను ఉండటం అంత బావుండదు కదా .. అన్నాడు శివ .
అవునా ? నేనోసారి సత్య ని చూసి రావాలి .. నువ్వెలాగు తీసుకోస్తున్నావు కదాని ... అన్నాడు యశ్ .
ఇత్స్ ఓకే యశ్ .. అది సరే .. ఇంతకీ గుడి తెరవడo గురిoఛి ఏం థింక్ చేసారు యశ్వంత్ .. రేపే కదా పౌర్ణమి
అయినా మనం ఆ విషయం లో అస్సలు సిద్ధంగా లేం .. ఏమంటావు ? అన్నడు శివ .
లేదు శివా .. అన్నీ వాటంతట అవే సిద్ధమవుతాయని విధాత్రి చెప్పింది మర్చిపోయావ ? ఆమె అలా చెప్పడం .
నెక్స్ట్ రచన ని చూసావా ? రేపు చాలా మంది రాబోతున్నరన్నట్లు గా అన్ని సిద్ధం చేస్తుంది .. ఇంత పని
చేయడం ఏమైనా మామూలు విషయమా ? ఊరంతా ఒక్కటిగా చేస్తున్నారు .. చాలా సంతోషం గా ఉంది శివ .
ఇదంతా చూస్తుంటే .. అన్నాడు యశ్వంత్ ..
అవును .. అయ్యో మర్చే పోయాను యశ్ .. కూరగాయలు అమ్మే స్థలానికి వెళ్లి కొన్ని కూరగాయలు అవీ
తెమ్మని చెప్పింది రచన .. నేనైతే ఆ విషయం మర్చిపోయి వచ్చేసా .. ఇంకా ఊరుకోదు .. నేవేల్తాను అని
లేచాడు శివ .
శివా నేను వస్తాను .. మధ్యాహ్నం నుంచి అలానే కూర్చున్నాను గా .. అలాగే సత్యని చూసొద్దాం అని లేచిన
యశ్ ఎదురుగ శంకరాన్ని చూసి .. మీరు ? అన్నాడు .
అయ్యా .. మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను .. అన్నాడు శంకరం , శివని ,యష్ ని చూస్తూ ..
చెప్పండి అన్నాడు సీరియస్ గా యశ్వంత్ ..
అయ్యా .. భూపతి పాపత్ముడే .. కాదనను .. కానీ కొన్నేళ్ళ నుండి నిర్మించుకున్న సామ్రాజ్యం కూలిపోతే తట్టు
కోలేరు కదా .. అన్నాడు శంకరం .
శంకరం గారు .. అతడు సామ్రాజ్యాన్ని నిర్మించుకోలేదు .. ఆక్రమించుకున్నాడు .. అన్నాడు శివ .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a Comment